బాస్‌పై కేసు.. 37 ల‌క్ష‌లు గెలుచుకుంది…!

ఓ మ‌హిళ త‌న బాస్‌పై (boss) కేసు వేసి గెల‌వ‌డ‌మే కాదు ఏకంగా రూ.37 ల‌క్ష‌లు వ‌ర‌కు డ‌బ్బు కూడా గెలుచుకుంది. ఈ ఘ‌ట‌న స్కాట్‌లాండ్‌లో చోటుచేసుకుంది. కారెన్ అనే మ‌హిళ 1995 నుంచి తిసిల్ మెరైన్ అనే ఇంజినీరింగ్ కంపెనీలో ప‌నిచేస్తోంది. అయితే కొంత‌కాలంగా ఆ కంపెనీ బాస్ కారెన్‌ను మాన‌సికంగా హింసిస్తున్నాడ‌ట‌. కారెన్‌కు మెనోపాజ్ ద‌శ రావ‌డంతో ఆమె ప‌లుమార్లు సెల‌వులు పెట్టింది.

ఈ విష‌యం గురించి బాస్‌కి చెప్తే నువ్వు వ‌ర్క్ త‌ప్పించుకోవ‌డానికి ఈ మెనోపాజ్ సాకు చెప్తున్నావా అని తిట్టేవాడ‌ట‌. దాంతో కారెన్ వెంట‌నే ఉద్యోగానికి రిజైన్ చేయ‌డ‌మే కాకుండా మానసికంగా వేధించిన బాస్‌పై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో వాదోప‌వాదాలు విన్న న్యాయ‌మూర్తి.. కారెన్ బాధ స‌బ‌బే అని ఆడ‌వారి వ్య‌క్తిగత అంశాల‌పై కామెంట్ చేసేవారిని ఊరికే వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని కారెన్ సంవ‌త్స‌రానికి సంపాదించే 37 వేల పౌండ్లు అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు 37 ల‌క్ష‌లు ప‌రిహారంగా ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసారు.