Rohit Sharma: బ‌య‌టి విష‌యాల‌తో నాకేం ప‌ని అంటూ రోహిత్ ఫైర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (rohit sharma) మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వ‌ర‌ల్డ్ కప్‌లో (world cup) ఆడ‌బోయే వారి పేర్లు ఈరోజు అనౌన్స్ చేసాక ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ గురించి ప్ర‌శ్న‌లు వేయ‌కుండా.. బ‌య‌ట ఏదో శ‌బ్దం వ‌స్తోంది ఏంటది అని ఓ రిపోర్ట‌ర్ అడిగారు. దాంతో రోహిత్‌కు ఒళ్లు మండింది. “” బ‌య‌టి విష‌యాల‌తో నాకేం ప‌ని. ఇక్క‌డ ప్రెస్ మీట్ జ‌రుగుతోంది కాబ‌ట్టి నా ఫోక‌స్ ఇక్క‌డే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అలాంటి ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌ను “” అంటూ ఫైర్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ టీం ఎంపిక‌పై మాట్లాడుతూ.. బెస్ట్ టీంను ఎంపిక చేసామ‌ని హార్దిక్ పాండ్య త‌మ‌కు ఫుల్ ప్యాకేజ్ అని అన్నాడు. హార్దిక్ వ‌రల్డ్ క‌ప్‌లో ఉంటే త‌మ‌కు ఎలాంటి భ‌యం లేద‌న్న ధీమా వ్య‌క్తం చేసాడు.