RBI: అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు డెడ్‌లైన్ పొడిగింపు

రూ.2000 నోటు మార్పిడిపై ఉన్న డెడ్‌లైన్ నేటితో ముగియ‌నున్న నేప‌థ్యంలో RBI అక్టోబ‌ర్ 7 వ‌ర‌కు డెడ్‌లైన్‌ను పొడిగించింది. గ‌డువును అక్టోబర్ 31 వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇదివ‌ర‌కే ఓ RBI అధికారి వెల్ల‌డించారు. కానీ RBI గ‌డువు తేదీని అక్టోబ‌ర్ 7 వ‌ర‌కే ఇచ్చింది. ఈలోగా నోట్ల‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోక‌పోతే డెడ్‌లైన్ తర్వాత జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది.