RBI: 2000 నోటు మార్పిడికి డెడ్‌లైన్ పొడిగింపు?

రూ.2000 నోటు మార్పిడి చేసుకునే ప్ర‌క్రియ‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi) అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని రిజ‌ర్వ్ బ్యాంక్ అధికారి అన‌ధికారిక‌రంగా వెల్ల‌డించారు. సెప్టెంబర్ 30 వ‌ర‌కు అన్ని రూ.2000 నోట్ల‌ను మార్పిడి చేసుకోవాల్సిందిగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. నోట్లు మార్చుకునేందుకు గ‌డువు రేప‌టికి ముగుస్తున్న నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు గడువు పెంచార‌ని అంటున్నారు. దీనిపై రిజ‌ర్వ్ బ్యాంక్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.