Ramana Deekshitulu: అధికారులు న‌న్ను ఇబ్బంది పెట్టారు

Ramana Deekshitulu: తిరుమ‌ల లడ్డూలో చేప నూనె, జంతువుల నూనె వాడి ల‌డ్డూలు త‌యారుచేసార‌న్న సంచ‌ల‌న రిపోర్టు బ‌య‌ట‌ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ఇదంతా జ‌రిగింద‌ని.. శ్రీవారితో పెట్టుకున్న‌వారు బాగుప‌డ‌ర‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. దీనిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

దీనిపై తిరుమ‌ల ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు స్పందించారు. ఒక్క ల‌డ్డూలోనే కాకుండా అన్ని ర‌కాల ప్ర‌సాదాల్లో క‌ల్తీ నెయ్యే వాడేవార‌ని.. ఇదే విష‌యాన్ని ఈవో, ఇత‌ర‌ అధికారుల‌కు చెప్తే వారు త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేసార‌ని అన్నారు. పెద్ద‌ల‌కు భ‌య‌ప‌డి తోటి అర్చ‌కులు కూడా త‌న‌కు స‌హ‌కరించ‌లేద‌ని అన్నారు. దాంతో ఏమీ చేయ‌లేక ఈ ఐదేళ్లు శ్రీవారే కాపాడాలనుకుంటూ ఉన్నాన‌ని ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న చేస్తాను అన‌డంతో కాస్త ధైర్యం వ‌చ్చింద‌ని తెలిపారు. శ్రీవారిపై విశేష‌మైన భ‌క్తి ఉన్న‌వారికి, మ‌న శాస్త్రం సంప్ర‌దాయాలు తెలిసిన వారికి తిరుమ‌ల‌లో సేవ చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును కోరుతున్న‌ట్లు తెలిపారు.