Vivaha Bhojanambu: సందీప్ కిష‌న్ రెస్టారెంట్‌లో నాసిర‌క‌పు ఆహార ప‌దార్థాలు

raids at Vivaha Bhojanambu reveals shocking details

Vivaha Bhojanambu: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కి చెందిన వివాహ భోజ‌నంబు రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసారు. దాడుల్లో పాడైన బియ్యం, నాసిర‌క‌పు ఆహార ప‌దార్థాలను గుర్తించారు. సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. పాడైపోయిన బియ్యం, నాసిర‌క‌పు ఆహార ప‌దార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టిముత్యాల రైస్ బ్యాగ్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరి, కిచెన్ ఆవరణ శుభ్రంగా లేకపోవటాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో హోటల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. చిన్న చిన్న హోట‌ళ్ల‌లో శుభ్ర‌త ఉండ‌ద‌ని చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్ల‌కు వెళ్తారు. ఆఖ‌రికి వారు కూడా శుభ్ర‌త విష‌యంలో ఆహార ప‌దార్థాల క్వాలిటీ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.