Punjab: కూతురి శ‌వాన్ని బైక్‌కి క‌ట్టి.. ఈడ్చుకెళ్లి…

Punjab: క‌న్న‌కూతురిని దారుణంగా చంప‌డ‌మే కాకుండా శ‌వాన్ని బైక్‌కు క‌ట్టి మ‌రీ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు ఓ క‌ర్క‌శ తండ్రి. ఈ దారుణ ఘ‌ట‌న పంజాబ్‌లో (punjab) చోటుచేసుకుంది. అమృత్‌స‌ర్‌కు చెందిన భావ్ అనే వ్య‌క్తి కూలీగా ప‌నిచేస్తున్నాడు. ఇత‌నికి 20 ఏళ్ల కూతురు ఉంది. ఎప్పుడూ త‌న కూతురిపై అనుమానంతోనే ఉండేవాడు. ఈ నేప‌థ్యంలో గ‌త వారం బుధ‌వారం రోజున ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లింద‌ట‌. అయితే ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా వెళ్ల‌డంతో అబ్బాయిని ప్రేమిస్తోందేమోన‌న్న అనుమానం వ‌చ్చింది. ఆమె ఇంటికి వ‌చ్చాక క‌నీసం వివ‌రాలు కూడా అడ‌గ‌కుండా చావ‌బాదాడు. ఆ త‌ర్వాత క‌త్తితో దాడి చేసాడు. దాంతో ఆ యువతి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అయినా కూడా భావ్‌కి కోపం చ‌ల్లార‌లేదు. క‌న్న కూతురు అని కూడా చూడ‌కుండా ఆమె శ‌వాన్ని త‌న బైక్‌కి క‌ట్టి రోడ్ల‌పై ఈడ్చుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అత‌న్ని ఆపారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో భావ్‌ని అదుపులోకి తీసుకున్నారు.