Vikarabad: అక్ర‌మ సంబంధాలు.. హ‌త్య‌లు..!

Vikarabad: వికారాబాద్‌లో సైకో కిల్ల‌ర్ వీరంగం సృష్టిస్తున్నాడు. అక్ర‌మ సంబంధాలు పెట్టుకుని వారిని హ‌త్యలు చేస్తూ బ‌తికేస్తున్నాడు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురిని చంపిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో వికారాబాద్ ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవ‌ల వికారాబాద్‌లో ఓ మ‌హిళ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న వెలుగులోకి రాగానే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మృతురాలు చేవెళ్ల‌కు చెందిన అన‌సూయ‌గా గుర్తించారు. అన‌సూయ నాలుగు రోజుల క్రితం హ‌త్య‌కు గురైంది. అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లి చీరకొంగును మెడ‌కు బిగించి మ‌రీ చంపేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టేసాడు.

ఎవ‌రీ సైకో కిల్ల‌ర్

నిందితుడు రామ‌స్వామిగా పోలీసులు గుర్తించారు. ఆల్రెడీ ఇత‌నిపై సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా ముద్ర ఉంది. ప‌లు కేసులు కూడా న‌మోదై ఉన్నాయి. రామ‌స్వామి అలియాస్ బాబుపై గ‌తంలో ఐదు కేసులు న‌మోదై ఉన్నాయి. అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవ‌డం వారిని లోబ‌రుచుకోవ‌డం మోజు తీరాక చంపేయ‌డం.. ఇదే వీర‌స్వామి ప‌నిగా పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతానికి రామ‌స్వామి పోలీసుల అదుపులో ఉన్నాడు.