Telangana Elections: ప‌ఠాన్‌చెరులో పోలింగ్ అధికారి మృతి

Telangana Elections: సంగారెడ్డి జిల్లాలోని ప‌ఠాన్‌చెరులో అప‌శృతి చోటుచేసుకుంది. 248వ‌ పోలింగ్ స్టేష‌న్‌లో పోలింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుధాక‌ర్ అనే వ్య‌క్తి ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలి ప‌డిపోయారు. దాంతో ఆయ‌న్ను వెంట‌నే స్థానిక హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆయ‌న గుండెపోటుకు గురై చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దాంతో పోలింగ్ కొంత స‌మ‌యం పాటు నిలిచిపోయింది.