Coromandel Express: రైలెక్కే ముందు ప్ర‌యాణికుడి ప్రార్ధ‌న‌లు

Hyderabad: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న (coromandel express) ఇంకొన్నేళ్ల పాటు గుర్తుంచుకునే చేదు జ్నాప‌కాల‌ను మిగిల్చింది. రైలులో ప్ర‌యాణించాలంటేనే జ‌నం ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. అందులోనూ కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారి సంఖ్య బాగా త‌గ్గిపోయింద‌ట‌. ఇందుకు కార‌ణం వారం క్రితం జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంలో కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ (coromandel express) కూడా ఉంది. అందులోనూ ఇది కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌కి (coromandel express) జరిగిన మూడో ప్ర‌మాదం. ఈ నేప‌థ్యంలో కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ వ్య‌క్తి రైలు ఎక్కే ముందు దేవుడా ఏమీ కాకుండా చూడు అని ప్రార్ధిస్తున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌తీష్ రెడ్డి అనే BRS నేత ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. మోదీ ప్ర‌భుత్వం (modi government) ఏ స్థాయికి తెచ్చిందో చూడండి అని కామెంట్ చేసారు.