Pakistan: నా భార్య‌ను వెన‌క్కి పంపండి ప్లీజ్..!

Delhi: ప‌బ్జీలో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తి కోసం న‌లుగురు పిల్ల‌ల‌తో క‌లిసి ఇండియాకు వ‌చ్చేసింది పాకిస్థాన్‌కు (pakistan) చెందిన ఓ మ‌హిళ‌. దాంతో ఇప్పుడు ఆమె భ‌ర్త భార‌త ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నాడు. త‌న భార్య‌ను వెనక్కి పంపించేయాల‌ని అంటున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. పాకిస్థాన్‌కు చెందిన సీమా హైద‌ర్ అనే మ‌హిళ పబ్జీ గేమ్ తెగ ఆడుతుండేది. అలా గేమ్‌లో దిల్లీలోని నోయిడాకు చెందిన వ్య‌క్తితో ప‌రిచ‌యం పెంచుకుంది. అలా వారిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ఆమెను ఇండియాకు వ‌చ్చేయాల‌ని ఆ వ్య‌క్తి చెప్పాడ‌ట‌. దాంతో ముందు వెన‌క ఆలోచించకుండా పిల్ల‌ల‌తో క‌లిసి నేపాల్ బోర్డ‌ర్ నుంచి అక్ర‌మంగా ఇండియాలోకి అడుగుపెట్టింది.

విష‌యం సౌదీ అరేబియాలో ఉన్న సీమా భ‌ర్త గులామ్ హైద‌ర్‌కు తెలిసింది. దాంతో అత‌ను వీడియో కాల్ ద్వారా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రిక్వెస్ట్ పెట్టాడు. త‌న భార్య చేసింది త‌ప్పే అని నోయిడాకు చెందిన వ్య‌క్తి ఏవేవో చెప్పి సీమా మ‌న‌సు మార్చేసాడ‌ని అన్నాడు. ఇంకెప్పుడూ ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని, క్షేమంగా త‌న భార్య పిల్ల‌ల్ని పాకిస్థాన్‌కు త‌ర‌లించాల‌ని వేడుకున్నాడు. ప్ర‌స్తుతానికైతే సీమా హైద‌ర్‌, ఆమె పిల్ల‌లు దిల్లీ పోలీసుల కస్ట‌డీలో ఉన్నారు.