ఒక్క చేప‌ను అమ్మి కోటీశ్వ‌రుడు అయిపోయాడు..!

Pakistan: ఓ మ‌త్స్య‌కారుడి జీవితం ఒకే ఒక్క చేప‌తో మారిపోయింది. ఒక్క చేప‌ను అమ్మి ఆయ‌న కోటీశ్వ‌రుడు అయిపోయాడు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. హాజీ బ‌లోచ్ అనే మ‌త్స్య‌కారుడు నిన్న స్థానిక హైద‌రి ఫిషింగ్ గ్రామంలో సోవా అనే అరుదైన చేప‌ను ప‌ట్టుకున్నాడు. ఈ చేప‌లో బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ట‌. క‌రాచీ తీర ప్రాంతంలో ఈ చేప‌ల‌ను అమ్మితే దాదాపు 7 కోట్ల రూపాయ‌ల లాభం వ‌చ్చింద‌ట‌. ఈ చేప క‌డుపులో ఎన్నో ఔష‌ద గుణాలున్నాయి. ఈ చేప నుంచి ల‌భించే ఒక విధ‌మైన దారాల‌ను స‌ర్జ‌రీకి ఉప‌యోగిస్తారు. 20 నుంచి 40 కిలోల బ‌రువు ఉండే ఈ సోవా చేప‌లు 1.5 మీట‌ర్ల వ‌ర‌కు పెరుగుతాయి.