Train Accident: ఆ శవాల్లో నా బిడ్డ క‌నిపించ‌డంలేదు

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న (odisha train accident) త‌ర్వాత ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ వ‌ద్ద కుప్ప‌లు తెప్ప‌లుగా మృత‌దేహాలు ప‌డి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ తండ్రి త‌న కొడుకు బ‌తికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృత‌దేహాల్లో త‌న కొడుకుని వెతుక్కుంటూ క‌నిపించిన దృశ్యం వైర‌ల్‌గా మారింది. ఒక్కొక్క మృత‌దేహం ద‌గ్గ‌రికి వెళ్లి నా కొడుకేనా అనుకుంటూ ఆ క‌న్న‌తండ్రి ప‌డే మ‌నోవేద‌న వ‌ర్ణ‌నాతీతం. అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీస్తూ వివ‌రాలు అడిగి తెలుసుకున్నాడు.

ఎవ‌రి కోసం వెతుకుతున్నారు అని అడ‌గ్గా.. నా కొడుకు. ఇదే కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్ర‌యాణించాడు. బ‌తికే ఉన్నాడో లేడో తెలీదు. బ‌తికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ రాలేదంటే చ‌నిపోయి ఉంటాడు క‌దా. అందుకే వెతుక్కుంటున్నా. చాలా సేప‌టి నుంచి ఈ మృతదేహాల్లో నా కొడుకుది ఉందేమో అని వెతుక్కుంటున్నా. కానీ దొర‌కడంలేదు అంటూ క‌న్నీరుమున్నీర‌య్యారు. ఏ క‌న్న‌తండ్రికీ ఇలాంటి శోకం వ‌ద్దురా భ‌గ‌వంతుడా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.