Odisha Train Accident: నా బిడ్డ‌ను వెతికిపెట్టండ‌య్యా…

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో (odisha train accident) హృద‌యం ద్ర‌వించే దృశ్యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. సోద‌రుల‌ను, త‌ల్లిదండ్రుల‌ను, బిడ్డ‌ల‌ను కోల్పోయిన వారి రోద‌న‌లు మిన్నంటుతున్నాయి. ఓ కూలీ తన బిడ్డ క‌నిపించ‌కుండాపోయాడ‌ని కాస్త వెతికి పెట్టండ‌ని ఏడ‌స్తూ ప్రాథేయ‌ప‌డుతున్న దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రైలు ప్ర‌మాదం (odisha train accident) త‌ర్వాత అత‌ను షాక్‌లో ఉన్నాడు. స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ను అదృష్టం బాగుండి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు కానీ త‌న బిడ్డ మాత్రం క‌నిపించ‌లేద‌ట. బ‌తికి ఉన్నాడో లేడో కూడా తెలీద‌ని, కాస్త వెతికిపెట్టండి అంటూ క‌న్నీరుమున్నీర‌వుతున్నాడు. ఇత‌నితో పాటు ఎంద‌రో బాధితులు త‌మ వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఫోన్లలో ఉన్న త‌మ‌వారి ఫొటోల‌ను చూపిస్తూ బ‌తికున్నారో లేదో చెప్పండి అంటూ కన్నీరుమున్నీరు అవుతున్న వారి దీన‌స్థితిని చూస్తే హృద‌యం ద్ర‌వించ‌క మాన‌దు.