Nizamabad: పుష్కరిణిలో ఈత కొట్టిన ఆల‌య ఈవో!

Nizamabad: స్వామివారికి అభిషేకం చేస్తుండ‌గా ఆల‌య ఈఓ(EO) కొల‌నులో ఈత కొట్టిన ఘ‌ట‌న నిజామాబాద్‌లో (nizamabad) చోటుచేసుకుంది. నీలకంఠేశ్వర ఆలయంలో (neelakanteshwara temple) విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా పుష్కరిణిలో ఆల‌య ఈఓ వేణు ఈత‌కొడుతూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో అక్కడే ఉన్న ఓ భ‌క్తుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. స్వామివారి కొల‌నుంటే ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. పుష్క‌రిణిలో స్నానం ఆచ‌రించ‌డం వేరు.. అందులో స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసిన‌ట్లుగా ఈత కొట్ట‌డం వేరు. ఆ విష‌యం తెలీని ఈఓ వేణుపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే ఆయ‌న్ను ఈఓ స్థానం నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.