Reliance AGM: నీతా అంబానీ రాజీనామా

రిల‌య‌న్స్ సంస్థ ఏటా నిర్వ‌హించే వార్షిక స‌మావేశం (reliance agm) ఈరోజు జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో రిల‌య‌న్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా ముఖేష్ అంబానీ (mukesh ambani)భార్య నీతా అంబానీ (nita ambani) దిగిపోయారు. ఆమె స్థానంలో పిల్ల‌లు ఆకాష్‌, అనంత్, ఇషా అంబానీలు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న‌ట్లు ముఖేష్ తెలిపారు. అనంత్, ఇషా, ఆకాష్‌లు నాన్ ఎగ్జిక్యూటివ్ స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ నిర్ణ‌యాన్ని షేర్ హోల్డ‌ర్ల‌తో చ‌ర్చించామ‌ని వారి నిర్ణ‌యం పెండింగ్‌లో ఉంద‌ని తెలిపారు. బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా నీతా అంబానీ త‌ప్పుకున్న‌ప్ప‌టికీ.. రిల‌య‌న్స్‌కు సంబంధించిన అన్ని ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ల‌కు మీటింగ్‌ల‌కు నీతా అటెండ్ అవుతారు. ఆమె స‌ల‌హాలు ఇప్ప‌టివ‌ర‌కు కంపెనీకి ఎంతో మంచి చేసాయ‌ని ముఖేష్ తెలిపారు. (reliance agm)