Viveka Case: కొత్త ట్విస్ట్

Viveka Case: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి (ys avinash reddy) నుంచి త‌న‌కు త‌న భ‌ర్త‌కు ప్రాణ హాని ఉంద‌ని నిందితుడు ద‌స్త‌గిరి (dastagiri) భార్య ష‌బానా (shabana) మీడియా ముందుకు వ‌చ్చి ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

త‌న భ‌ర్త‌ను త‌ప్పుడు కేసులో ఇరికించి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy), అవినాష్ రెడ్డి టార్చ‌ర్ పెడుతున్నార‌ని తెలిపారు. కుటుంబం అవినాష్ ఒక్క‌డికే కాద‌ని త‌న‌కు కూడా ఉంద‌ని బాధ‌ప‌డ్డారు. వివేకా కేసు తెలంగాణ‌కు బ‌దిలీ అయినందుకు ద‌స్త‌గిరిని తెలంగాణ పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. తాను ఇంత వ‌ర‌కు అవినాష్ రెడ్డి గురించి ఇలా బ‌య‌టికి వ‌చ్చి మాట్లాడింది లేదని కానీ వారి బెదిరింపులు మితిమీరుతుండ‌డంతో ఇక త‌ప్ప‌క మీడియా ముందుకు రావాల్సి వ‌చ్చింద‌ని షబానా ఆవేద‌న వ్య‌క్తం చేసారు.