Kolkata Rape Case: మృత‌దేహం నుంచి 150 మిల్లీగ్రాముల వీర్యం ల‌భ్యం.. క‌ల‌క‌త్తా రేప్ కేసులో బిగ్ ట్విస్ట్

new twist in kolkata rape case

Kolkata Rape Case: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌ల‌క‌త్తా అత్యాచారం కేసులో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలి మృతదేహానికి వైద్య పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఆమె యోనిలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ల‌భించింద‌ని.. ఒక వ్య‌క్తి నుంచి అంత వీర్యం రాద‌ని ఆరోపిస్తున్నారు. దీనిని బ‌ట్టి చూస్తే ఆమెపై గ్యాంగ్ రేప్ జ‌రిగి ఉండ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ల‌క‌త్తాలోని RG క‌ర్ మెడిక‌ల్ హాస్పిట‌ల్‌లో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్న 31 ఏళ్ల యువ‌తిపై అదే హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న వైద్యుడు ఆమెపై దారుణంగా అత్యాచారం చేసాడు.

ఆమె మృతదేహం ల‌భ్యమైన‌ప్పుడే క‌ళ్ల నుంచి ఇత‌ర భాగాల నుంచి ర‌క్తం కారుతున్న‌ట్లు క‌నిపించింది. ప్ర‌స్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేయ‌గా ఆమె యోని వ‌ద్ద 150 మిల్లీ గ్రాముల వీర్యం ల‌భించింద‌ని.. ఇంకా ఎవ‌రైనా ఈ అత్యాచారానికి పాల్ప‌డి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిందేన‌ని ప‌శ్చిమ బెంగాల్‌కి చెందిన వైద్యులంతా ఆందోళ‌న చేస్తున్నారు. పోలీసులు ఈ కేసు ద‌ర్యాప్తు విఫ‌లం అవ‌డంతో కేసును సీబీఐకి అప్ప‌గించారు.