Nawaz Modi: తిండి, నీళ్లు ఇవ్వ‌కుండా తిరుమ‌ల‌ కొండ ఎక్కించాడు

Nawaz Modi: రేమండ్స్ (raymonds) అధినేత గౌత‌మ్ సింఘానియా (gautam singhania) న‌వాజ్ మోదీ (nawaz modi) దంప‌తులు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గౌత‌మ్ సింఘానియా ప‌శువులా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని న‌వాజ్‌తో పాటు గౌత‌మ్ తండ్రి కూడా చెప్తున్నాడు. త‌న‌ను దారుణంగా కొట్టి చంపుతుంటే ఒక‌ప్పుడు అంబానీలే కాపాడార‌ని న‌వాజ్ మీడియా వర్గాల‌తో వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు న‌వాజ్ మోదీకి సంబంధించి ఓ ఆడియో క్లిప్ లీక్ అయింది.

ఆ ఆడియోలో గౌత‌మ్ త‌న‌కు తిండి, నీళ్లు ఇవ్వ‌కుండా బ‌లవంతంగా తిరుమ‌ల మెట్లు ఎక్కించాడ‌ని చెప్తున్నారు. గౌత‌మ్‌, న‌వాజ్‌ల పెళ్లి జ‌రిగితే న‌వాజ్ చేత తిరుప‌తి కొండ ఎక్కిస్తాన‌ని గౌత‌మ్ మొక్కుకున్నాడ‌ట‌. వీరి పెళ్లి అయ్యాక న‌వాజ్ చేత కొండ ఎక్కించాడు కానీ నీళ్లు, తిండి కూడా పెట్ట‌లేదని న‌వాజ్ ఆడియోలో చెప్పారు. తిరుమ‌ల మెట్లు ఎక్కుతున్న‌ప్పుడు రెండు మూడు సార్లు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాన‌ని అయినా గౌత‌మ్ క‌నిక‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. గ‌తంలో TTD ముంబైలో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణం చేయాల‌నుకున్న‌ప్పుడు గౌతమ్ సింఘానియా రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు.