Karnataka: వామ్మో జ‌స్ట్ మిస్..!

Bengaluru: జ‌స్ట్ మిస్.. ఏమాత్రం అటూ ఇటూ అయినా కనీసం రెండు మూడు ప్రాణాలైనా పోయేవే. క‌ర్ణాట‌క‌లోని (karnataka) బిజీ రోడ్డులో ఒక్క‌సారిగా రైల్వే బ్రిడ్జ్‌కి ఆనుకుని ఉన్న‌ పోల్ ప‌డిపోయింది. ఓ ట్రక్కు అడ్డుగా ఉండ‌టంతో వెన‌కే ఉన్న మోట‌ర్ బైక్‌.. ఆ వెన‌కే అల‌ర్ట్‌గా ఉన్న డ్రైవ‌ర్ స‌మ‌యానికి బ్రేక్ వేయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. హుబ్బ‌ళిలోని క‌మ‌ర్షియ‌ల్ హ‌బ్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గలేదు కాబ‌ట్టి ఈ వార్త వైర‌ల్ అవ్వ‌లేదు కానీ సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో మాత్రం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇలాంటి వాటిపై త‌గిన జాగ్ర‌త్త‌లు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ప్రాణాపాయం త‌ప్ప‌ద‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. అయితే ఆ పోల్‌ని రాత్రి వేళ్ల‌ల్లో లారీ లాంటిది ఏదైనా ఆల్రెడీ ఢీకొట్టి ఉంటుంద‌ని అందుకే అది అలా వంగి ప‌డిపోయింద‌ని స్థానిక అధికారులు చెప్తున్నారు. దానిని తొల‌గించి వెంట‌నే కొత్తది ఏర్పాటుచేసామ‌ని పేర్కొన్నారు.