BJP కి ఓటేసిన ముస్లిం మ‌హిళ‌.. చావ‌బాదిన కుటుంబీకులు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓ ముస్లిం మ‌హిళ BJPకి ఓటు వేసింది. ఈ విష‌యం ఇంట్లో వారికి తెలీడంతో వారు ఆడ‌పిల్ల అని కూడా చూడ‌కుండా చావ‌బాదారు. స‌మీనా అనే యువ‌తి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో BJP భారీ మెజారిటీతో గెలిచిన నేప‌థ్యంలో ఆమె సంబ‌రాలు చేసుకుంది. ఈ విష‌యం ఆమె బావ అయిన జావేద్ ఖాన్‌కు తెలిసింది. ఎందుకు సంబ‌రాలు చేసుకుంటున్నావు అని అడిగితే.. నేను BJP గెల‌వాల‌నుకున్నాను. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది. అప్పుడే ఆమె BJPకి ఓటు వేసిన‌ట్లు తెలిసింది. దాంతో చెంప ఛెళ్లుమ‌నిపించాడు. దాంతో స‌మీనా వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు జావేద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.