Gate ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం

Hyderabad: గేట్ (gate) ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ కాంతారావుపై (kantarao) హత్యాయత్నం జ‌రిగింది. కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ పార్టనర్స్ సుపారీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా ఐదు లక్షలు చెల్లించార‌ట‌. కాంతారావును హత్య చేసే కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టారు. గ‌మ‌నించిన కాంతారావు అక్క‌డి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న‌ కారును డీసీఎం ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో కాంతారావు బ‌య‌ట‌ప‌డ్డారు. వెంట‌నే పోలీసులు కేసు నమోదు చేసి 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.