ప‌లుమార్లు రేప్.. సెక్స్‌కి అల‌వాటుప‌డిపోయిన బాలిక‌.. హైకోర్టు సంచ‌ల‌నం

Mumbai: ఓ బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ‌టంతో ఆమె నింఫోమేనియాక్‌గా మారిపోయిందని బొంబాయ్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ముంబైకి చెందిన ఓ బాలిక‌ను ప‌దేళ్లుగా నిందితుడు రేప్ చేస్తూ వ‌స్తున్నాడ‌ని.. ఇప్పుడు ఆ బాలిక వ‌య‌సు 17 ఏళ్లు అయిన‌ప్ప‌టికీ నింఫోమేనియాక్‌గా మారిపోయి సెక్స్ కోసం ప‌రిత‌పిస్తోంద‌ని న్యాయ‌మూర్తి తెలిపారు. బాలిక‌ను ట్యాబ్లెట్ ఇచ్చి మ‌రీ ఆమెలో కోరిక క‌లిగేలా చేసి అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుడు బెయిల్ అప్లై చేసుకోగా.. చిన్న‌పిల్ల‌ని దారుణ‌మైన స్థితికి చేర్చిన వాడికి బెయిల్ ఎలా ఇవ్వాల‌ని మండిప‌డ్డారు.

ఇటీవ‌ల ఆ బాలిక ఓ అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు త‌న గ‌దిని వెతికించారు. ఆ స‌మ‌యంలో ఓ డైరీ ల‌భించింది. ఆ డైరీలో ఓ వ్య‌క్తి త‌న‌పై నాలుగో త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పటి నుంచి అత్యాచారానికి పాల్ప‌డుతున్న‌ట్లు రాసింది. ఈ విష‌యం నిందితుడి భార్య‌కు కూడా తెలుస‌ని పేర్కొంది. త‌న త‌ల్లికి ఈ విష‌యం చెప్ప‌డంతో ప‌రువు పోతుంద‌ని ఆమె ఎవ్వ‌రికీ చెప్ప‌క‌పోవ‌డంతో ఆ బాలిక వేరే దారి లేక ఇంట్లో నుంచి పారిపోయింది. ప్ర‌స్తుతం ఆ బాలిక ప‌రిస్థితి ఎంతో ద‌య‌నీయంగా ఉంద‌ని.. రోజుకు ఒక‌సారైనా కామ‌వాంఛ తీర‌క‌పోతే ఏడ్చేస్తోంద‌ని ఈ వ్యాధిని నింఫోమేనియాక్ అంటార‌ని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారు.