Hyderabad: ప్రేమ వ్యవహారంలో కన్న కూతురిని చంపిన తల్లి!

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలో భార్గవి (19) అనే యువతికి మేన బావతో పెళ్లి కుదరింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడింది. అదే సమయంలో తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి, చీరతో ఉరేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.