Karnataka: కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి

Karnataka: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో దారుణం చోటుచేసుకుంది. త‌ల్లీకూతుళ్లు ఒక‌రినొక‌రు క‌త్తుల‌తో పొడుచుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో కూతురు మృతిచెందింది. బెంగళూరులోని బనశంకరికి చెందిన బ‌న‌ సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు మరణించగా.. తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.