Covid: 23 మ‌ర‌ణాలు.. మాస్కులు త‌ప్ప‌నిసరి

Covid: కోవిడ్ ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా వ్యాప్తిచెందుతోంది. ఇండియా మొత్తంలో ఇప్ప‌టివ‌ర‌కు 23 మంది మృతిచెందారు. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కొత్త ఉప‌ర‌కం JN.1 ఊహించిన‌దాని కంటే త్వ‌ర‌గా వ్యాప్తించెందుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో 358 తాజా కేసులు న‌మోద‌య్యాయి. అయితే కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్తోందే కానీ ప్ర‌యాణికుల‌కు ఎలాంటి నిబంధ‌న‌లు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.