Kurnool: త‌ల్లిదండ్రుల‌నే కిడ్నాప్ చేయ‌బోయాడు!

Kurnool:  ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే కిడ్నాప్ చేయబోయాడు ఓ నీచ‌పు కొడుకు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్నూలులోని (kurnool) వెల్దుర్తి మండ‌లంలో చోటుచేసుకుంది. మల్లేపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీదేవిల కొడుకు తిప్ప‌రాజు వారి పేరిట ఉన్న ఆస్తుల‌న్నీ తన పేరు మీద రాయించుకోవాల‌ని ప్లాన్ వేసాడు. ఈ నేప‌థ్యంలో వారిని కిడ్నాప్ చేయించాల‌ని ప్లాన్ వేసాడు. కొంద‌రు వ్య‌క్తుల‌కు సుపారీ ఇచ్చి వారిని కిడ్నాప్ చేయించాల‌నుకున్నాడు. వారు కిడ్నాప్ చేసే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు చూసి వారిని విచారించారు. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో వారు కూడా షాక‌య్యారు. వెంట‌నే నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.