Viral News: ప్రేయ‌సి కోసం ప్రాణం ప‌ణంగా పెట్టి..

man saves girlfriend from desert heat

Viral News: విహార‌యాత్ర నిమిత్తం ఎడారిలోకి వెళ్లిన ఓ జంట తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోయింది. ఈ ఘ‌ట‌న ద‌క్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఓ జంట కాలిఫోర్నియాలోని జోషువా ట్రీ నేష‌న‌ల్ పార్క్‌కు ట్రెకింగ్ కోస‌మ‌ని వెళ్లారు. ట్రెక్కింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ ఎడారి లాంటి ప్ర‌దేశంలో ఇరుక్కుపోయారు. వారితో పాటు తెచ్చుకున్న నీళ్లు అయిపోవ‌డంతో ఇద్దరూ దాహంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయారు. ఆ స‌మ‌యంలో ఎండ ఎక్కువగా ఉండ‌టంతో త‌న ప్రియురాలిని కాపాడుకునేంద‌కు ఆ వ్య‌క్తి త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి కొన్ని గంటల పాటు ఆమెకు నీడనిచ్చాడు.

ఆ వెంట‌నే ఆ వ్య‌క్తి 911కి ఫోన్ చేయ‌డంతో అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. హెలికాప్ట‌ర్ సాయంతో వారిని వెతుకుతుండ‌గా ఓ ఎడారిలాంటి ప్ర‌దేశంలో జీవ‌చ్ఛ‌వాల్లా ప‌డి ఉండ‌టం గ‌మ‌నించారు. వెంట‌నే వారికి నీళ్లు ఇచ్చి ర‌క్షించారు. యువతి ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫోటో ఒక‌టి బ‌య‌టికి రావ‌డంతో వైర‌ల్‌గా మారింది.