ప్రేయ‌సి కోసం భార్య‌కు పిండం

man performs shradh to wife

Viral News: బ‌తికుండ‌గానే ఓ వ్య‌క్తి భార్య‌కు పిండం పెట్టాడు. ఇలా చేస్తే ప్రేయ‌సిని పెళ్లి చేసుకోవ‌చ్చు అని ప్లాన్ వేసాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. క‌న్నౌజ్ ప్రాంతానికి చెందిన ప‌వన్ అనే వ్య‌క్తికి ఆల్రెడీ పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అత‌ను భార్య‌ను ఇంట్లో నుంచి పుట్టింటికి పంపించేసి.. మ‌రో అమ్మాయిని ప్రేమించి మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండానే పెళ్లి చేసేసుకున్నాడు. ఎక్క‌డ త‌న బండారం బ‌య‌ట‌ప‌డుతుందో అని భావించి మొద‌టి భార్య చ‌నిపోయింద‌ని చెప్పి పిండం పెట్టే కార్య‌క్ర‌మం ఏర్పాటుచేసాడు. ఈ విష‌యం తెలుసుకున్న భార్య వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. తాను బ‌తికే ఉన్నానని.. త‌న పిల్ల‌ల‌ను లాక్కుని ఇంట్లో నుంచి గెంటేసి మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌ని కేసు పెట్టింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.