Viral News: సారీ అమ్మా నిన్ను చంపినందుకు

man kills mother and posts condolences on social media

Viral News: కన్న త‌ల్లిని దారుణంగా చంపేసి ఆమె మృత‌దేహం ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ యువ‌కుడు. ఆ ఫోటోకి సారీ అమ్మా. నిన్ను చంపాల్సి వ‌చ్చింది. న‌న్ను క్ష‌మించు అని క్యాప్ష‌న్ కూడా రాసాడు. ఆ పోస్ట్ చూసిన వారు హ‌డ‌లిపోయి వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో చోటుచేసుకుంది. రాజ్‌కోట్ జిల్లాకు చెందిన జ్యోతిబెన్ గోసాయ్ అనే 48 ఏళ్ల మ‌హిళ త‌న కుమారుడు నీలేష్‌తో క‌లిసి ఉంటోంది. జ్యోతిబెన్ 20 ఏళ్ల క్రితమే త‌న భ‌ర్త‌తో విడిపోయింది. మిగ‌తా పిల్ల‌లు కూడా వారి దార్లు వారు చూసుకున్నారు.

నీలేష్ ఒక్క‌డే త‌న త‌ల్లితో క‌లిసి ఉంటున్నాడు. అయితే.. జ్యోతిబెన్ కొంత‌కాలంగా మాన‌సిక రోగిలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ట‌. రోజూ నీలేష్‌తో ఏదో ఒక గొడ‌వ‌పెట్టుకుంటూనే ఉంటోంది. నిన్న నీలేష్‌కి జ్యోతికి పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌డంతో ఆమె గొంతు నులిమి చంపేసాడు. ఆ త‌ర్వాత ఆమె మృతదేహాన్ని ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. పోలీసులు నీలేష్‌ను అదుపులోకి తీసుకోగా జ‌రిగిన‌దంతా చెప్పి తానే చంపానని ఒప్పుకున్నాడు.