Madhya Pradesh: చాక్లెట్లు అడుగుతోంద‌ని కూతుర్ని చంపేసాడు!

Madhya Pradesh: చాక్లెట్లు కొనిపెట్ట‌మ‌ని అడిగింద‌ని క‌న్న కూతుర్నే దారుణంగా చంపేసాడు ఓ క‌సాయి తండ్రి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. ఓ 37 ఏళ్ల వ్య‌క్తి డ్ర‌గ్స్‌కి బానిసై మ‌త్తు మందులు వాడుతుండేవాడు. ఇత‌నికి ఓ మైన‌ర్ కూతురు ఉంది (madhya pradesh) . ఈ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా క‌ట్టుకున్న భార్య వ‌దిలేసి వెళ్లిపోయింది. క‌న్న‌త‌ల్లి బిచ్చం ఎత్తుకుంటూ జీవిస్తోంది. కూతురు రోజూ బొమ్మ‌లు, చాక్లెట్లు అడుగుతోంద‌ని విసిగిపోయిన ఆ వ్య‌క్తి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లోప‌లికి తీసుకెళ్లి అక్క‌డున్న టైల్స్‌తో పాప త‌ల‌పై కొట్టి చంపేసాడు. ఆ తర్వాత మత్తులో అత‌నే పోలీసుల‌కు లొంగిపోయాడు. ఓట‌ర్ కార్డు ల‌భించింది కానీ రేష‌న్ కార్డు లేద‌ని అందుకే పిల్ల‌కు తిండి కూడా పెట్ట‌లేక పస్తు ఉంటున్నాడ‌ని పోలీసులు తెలిపాడు. మ‌త్తులో బిడ్డ‌ను చంపేసిన‌ట్లు తెలుస్తోందిన పేర్కొన్నారు. అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు చేయించి రిమాండ్‌కు త‌ర‌లించారు.