Khammam: కోరుకున్న కొలువు.. చ‌నిపోయాక ద‌క్కింది

చ‌నిపోయాక సాధించిన విజ‌యం వృథా అయిపోయింది. బ‌తికున్న‌ప్పుడు రాసిన కానిస్టేబుల్ రాత ప‌రీక్ష‌ల్లో ఆ యువ‌కుడు పాసై క‌ల‌లు క‌న్న ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు. కానీ ఏం లాభం. ఆ విజ‌యం మ‌ర‌ణం త‌ర్వాత ద‌క్కింది. ఖమ్మం (khammam) టేకులపల్లి పాత తాండాకు చెందిన భూక్యా ప్రేమ్ కుమార్, పద్మ అనే దంపతుల పెద్ద‌ కుమారుడు ప్రవీణ్ (22) కొన్ని నెల‌ల క్రితం పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసాడు. ఆగస్టు 17న స్నేహితుడితో కలిసి ఫ్లెక్సీ కడుతున్న స‌మ‌యంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి మరణించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ ఫలితాల్లో ప్రవీణ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపిక‌య్యాడు. ఈ ఆనంద క్షణాల్లో త‌మ బిడ్డ లేడ‌ని ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.