Chittoor: మ‌తం మార్చుకో అంటూ దాడిచేసిన ప్రేయ‌సి త‌ల్లి

Chittoor: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాల్సిందేనంటూ కుర్రాడిని చిత‌క‌బాదింది ఓ మ‌హిళ. ఈ దారుణ ఘ‌ట‌న చిత్తూరులో (chittoor) చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు వేరే మ‌తానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెళ్లికి ఒప్పుకోవాలంటే ఆ అబ్బాయి త‌మ మ‌తంలోకి మారాల‌ని యువ‌తి త‌ల్లి బ‌లవంత‌పెట్టింది. ఇందుకు ఆ యువ‌కుడు ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లోవారితో క‌లిసి దారుణంగా ఎటాక్ చేయించింది. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు స్థానిక గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు.