వేల‌ల్లో క‌రెంట్ బిల్లులు.. క‌ట్ట‌లేక యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

man dies after not able to pay exorbitant current bills

Current Bill: వ‌రుస‌గా వేల‌ల్లో క‌రెంట్ బిల్లులు వ‌స్తుండ‌డంతో అవి క‌ట్ట‌లేక ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్ ప్రాంతానికి చెందిన‌ శుభ‌మ్ అనే 25 ఏళ్ల యువ‌కుడికి సెప్టెంబ‌ర్‌లో రూ. 1,09,021 క‌రెంట్ బిల్లు వ‌చ్చింది. ఇదేంటి ఇంత వ‌చ్చింది అని స్థానిక ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి వెరిఫై చేయించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ రూ. 16,377 బిల్లు క‌ట్టాడు. ఈ బిల్లు క‌ట్టిన 15 రోజుల‌కే మ‌రో బిల్లు వ‌చ్చింది. అందులో క‌రెంట్ బిల్లు రూ. 8000 అయిన‌ట్లు వ‌చ్చింది.

ఇదే విష‌యాన్ని మీట‌ర్ రీడింగ్ వ్య‌క్తిని పిలిపించి అడ‌గ్గా ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అడిగితే చెప్తారు అని స‌ల‌హా ఇచ్చాడు. అయితే.. శుభ‌మ్ ఆ ప‌ని చేయ‌కుండా ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. ఇంట్లోవారికి ఈ విష‌యం ఉద‌యం తెలిసింది. వెంట‌నే పోలీసుల‌కు జ‌రిగినదంతా చెప్ప‌డంతో వారు ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో విచార‌ణ చేప‌ట్టాడు. శుభ‌మ్ గ‌త నెల‌లో కొత్త మీట‌ర్ పెట్టించుకున్నాడ‌ని.. అప్ప‌టి నుంచి ఇలా ఎక్కువ‌గా క‌రెంట్ బిల్లు వ‌స్తోంద‌ని ఓ అధికారి చెప్పాడు. అయితే.. దానిని మ‌రోసారి రెక్టిఫై చేస్తాం అని చెప్పేలోపే ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ని అనుకోలేద‌ని వారు వాపోయారు.