Train: రైలు బెర్త్ విరిగి మీదప‌డ‌టంతో ప్ర‌యాణికుడి మృతి

man dies after middle berth in train falls on him

Train: ఓ వ్య‌క్తి రైలులోని మిడిల్ బెర్త్ మీద ప‌డ‌టంతో ప్రాణాలు విడిచాడు. ఈ అరుదైన ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. కేర‌ళ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్తున్న అలీ ఖాన్ అనే వ్య‌క్తి కింద బెర్తులో నిద్రిస్తున్నాడు. రైలు తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్‌కు చేరుకున్న స‌మ‌యంలో ఉన్న‌ట్ఉటండి మిడిల్ బెర్త్ సీటు న‌ట్లు విరిగి మీద ప‌డింది. దాంతో అత‌ని మెడ భాగంలోని ఎముక‌లు విరిగాయి. వెంట‌నే రైల్వే అధికారులు ఆయ‌న్ను స్థానిక హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఎముక‌లు విరిగిపోవ‌డంతో వైద్యులు మూడు స‌ర్జ‌రీలు చేసారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు.