Doda: ఘోర ప్ర‌మాదం.. 30 మంది దుర్మ‌ర‌ణం

Doda: జమ్మూ క‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డంతో దాదాపు 30 మంది మృత్యువాత‌ప‌డ్డారు. కిష్ట్వ‌ర్ నుంచి జ‌మ్ము వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని అస్స‌ర్ ప్రాంతంలో వెళ్తున్న బ‌స్సు అదుపు త‌ప్పి 250 మీట‌ర్ల లోతులో ఉన్న లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30 మంది మృతిచెంద‌గా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.