Husnabad: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప‌ల్టీలు కొట్టిన కారు

Husnabad: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. కరీంన‌గ‌ర్ నుంచి హుస్నాబాద్‌కు వెళ్తున్న ఏపీ రిజిస్ట్రేష‌న్ బండి బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌డంతో కారు వెనుక భాగానికి బ‌స్సు త‌గిలింది. దాంతో. కారు నాలుగైదు ప‌ల్టీలు కొట్టి ఎగిరి ప‌డింది. కారులో నుంచి ఓ యువ‌కుడు బ‌య‌టికి ఎగిరి ప‌డి మృతిచెందగా మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కారులో ఉన్నవారంతా మైన‌ర్లుగా గుర్తించారు.