Lucknow: ప్ర‌భుత్వ ఉద్యోగి కూతురిపై గ్యాంగ్ రేప్..!

Lucknow: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్‌నౌలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి కూతురిని కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు. 22 ఏళ్ల మ‌హిళ కొంత‌కాలంగా ల‌క్‌నౌలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీకి వెళ్లి చికిత్స చేయించుకుంటూ ఉండేది. యూనివ‌ర్సిటీకి వెళ్లే స‌మ‌యంలో ఆ మ‌హిళ దారిలోని టీ కొట్టుకు వెళ్లి త‌న ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేది. దాంతో టీ అమ్ముకునే వ్య‌క్తి ఆమెపై క‌న్నేసాడు.

ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి కూడా ఆమె ఛార్జింగ్ పెట్టుకునేందుకు టీ షాప్‌కు వెళ్ల‌గా అయితే షాపులో క‌రెంట్ లేద‌ని ద‌గ్గ‌ర్లో ఉన్న ఆంబులెన్స్‌లో ప‌వ‌ర్ పాయింట్ ఉంద‌ని చెప్పి తీసుకళ్లాడు. తీరా వెళ్లి చూస్తే అక్కడ ఆంబులెన్స్ లేదు. దాంతో అత‌ను ద‌గ్గ‌ర్లో దాబా ఉంద‌ని చెప్పి తీసుకెళ్లాడు. ఆ స‌మ‌యంలో ఆమెను కారులో ఎక్కించుకుని కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి బ‌ల‌వంతంగా తాగించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆమెను రోడ్డుపై వ‌దిలేసి పారిపోయారు. వెంట‌నే త‌న తండ్రికి ఫిర్యాదు చేసిన ఆ మ‌హిళ పోలీసుల‌కు జ‌రిగిందంతా చెప్పింది. నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.20,000 న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు.