KPHB: ల‌వ‌ర్స్ ఆత్మ‌హ‌త్య‌.. పెళ్లికి ఒప్పుకోర‌నా?!

Hyderabad: హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో(kphb) ల‌వ‌ర్స్ ఆత్మ‌హ‌త్య(suicide) క‌లక‌లం సృష్టించింది. ఇద్ద‌రూ బంధువులు అయిన‌ప్ప‌టికీ ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చింది అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. మృతులు భీమ‌వ‌రంకు చెందిన శ్యాం, జ్యోతిలుగా గుర్తించారు. వీరిద్ద‌రూ బంధువులు కూడా. గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే జ్యోతికి రెండేళ్ల క్రితం వేరొక‌రితో పెళ్లి అయిన‌ప్ప‌టికీ భ‌ర్త టార్చ‌ర్ త‌ట్టుకోలేక విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత శ్యాం ప‌రిచ‌యం అవడంతో ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు.

అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలీదు కానీ.. సోమ‌వారం సాయంత్రం శ్యాం..జ్యోతిని త‌ను ఉంటున్న రూంకి తీసుకెళ్లాడు. ఈరోజు ఉద‌యం వ‌ర‌కు వారిద్ద‌రూ బ‌య‌టికి రాలేదు. రాత్రంతా జ్యోతి క‌నిపించ‌కుండాపోవ‌డంతో ఫ్రెండ్స్, బంధువులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ‌లేదు. అయితే.. శ్యాం గది నుంచి వాస‌న వ‌స్తుండ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. త‌లుపులు బద్ద‌ల‌గొట్టి చూడగా.. శ్యాం ఉరేసుకుని ఉన్నాడు. జ్యోతి నిద్ర‌మాత్ర‌లు మింగి నుర‌గ కక్కుకుని చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు. అయితే ఇంట్లో పెళ్లి ఒప్పుకోర‌నా.. లేక ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారా అన్న కోణంలో పోలీసులు కేసు న‌మోదు చేసిన దర్యాప్తు చేప‌డుతున్నారు.