Nalgonda: దొంగ‌కు పులిహోర తినిపించి పోలీసుల‌కు ప‌ట్టించి

Nalgonda: ఇళ్ల‌ల్లో చోరీకి పాల్ప‌డుతున్న ఓ దొంగ‌ను ప‌ట్టుకున్న స్థానికులు దేహ శుద్ధి చేసారు. ఇది అందరూ చేసేదే. ఇదో పెద్ద వార్తా అనుకుంటున్నారా? ఇక్క‌డే మాన‌వ‌త్వం పరిమ‌ళించే దృశ్యం చోటుచేసుకుంది. పాపం ఆ దొంగ త‌న‌కు ఆక‌లిగా ఉంది అన‌డంతో ఓ వ్య‌క్తి అత‌నికి పులిహోర తినిపించాడు. ఒక్కో ముద్దు పెడుతూ అత‌ని ఆక‌లి తీర్చాడు. ఏదేమైనా అత‌ను చేసింది త‌ప్పే కాబ‌ట్టి అత‌న్ని పోలీసుల‌కు ప‌ట్టించారు. ఈ ఘ‌ట‌న నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను పట్టుకొని యువ‌కులు చావ‌బాదారు. గ‌ణేష్ చేతులు కాళ్లు క‌ట్టేసి కొడుతుండ‌గా ఆకలి వేస్తుందని అనడంతో పులిహోర తినిపించారు. ఆ త‌ర్వాత పోలీసులకు అప్ప‌గించారు.