Lalitha Jewellers Kiran: డ‌బ్బులు ఊరికే రావు.. విజ‌య‌వాడ‌కు దానం చేస్తున్నా

Lalitha Jewellers Kiran donates 1 crore to flood victims

Lalitha Jewellers Kiran:  ప్ర‌ముఖ జువెల‌రీ సంస్థ ల‌లితా జువెల‌ర్స్ ఎండీ కిర‌ణ్ విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి దానం చేసారు. డ‌బ్బులు ఊరికే రావు అంటూ ఆయ‌న మీడియా ముందు మాట్లాడారు. “” డబ్బులు ఊరికే రావు.. కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత. 74 సంవ‌త్స‌రాల వయసులో కూడా చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారు. నేను వరద బాధితుల కోసం కోటి రూపాయ‌ల విరాళం ఇస్తున్నాను. మీరు కూడా మీకు తోచింది సాయం చేయండి “” అని పిలుపునిచ్చారు.