Parliament Breach: కొత్త ట్విస్ట్.. అదుపులో క‌ర్ణాట‌క పోలీస్ అధికారి కొడుకు!

Parliament Breach:  ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో లోక్ స‌భ స‌మావేశాలు జ‌రుగుతుంటే ఇద్ద‌రు దుండ‌గులు స‌భ‌లోకి ప్ర‌వేశించి రంగులు చ‌ల్లి నానా హంగామా చేసిన అంశం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా చ‌దువుకున్న‌వారేన‌ని నిరుద్యోగం కార‌ణంగా ఈ ప‌ని చేసార‌ని వారి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. పోలీసుల అదుపులో క‌ర్ణాట‌క‌కు చెందిన టాప్ పోలీస్ అధికారి కుమారుడు కూడా ఉన్నాడు.

నిందితుల్లో మ‌నోరంజన్ అనే ఇంజినీర్ కూడా ఉన్నాడు. ఇత‌ని స్నేహితుడు సాయి కృష్ణ క‌ర్ణాట‌క‌కు చెందిన విశ్రాంత డీఎస్పీ కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఇత‌ను బ‌గల్‌కోట్‌లో వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. దాంతో పోలీసులు సాయి కృష్ణ‌ను కూడా ఒక రోజు పాటు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే మ‌నోరంజ‌న్‌కు స్నేహితుడు అయినంత మాత్రాన పార్ల‌మెంట్ ఘ‌ట‌న‌లో ఇత‌ని హ‌స్తం ఉన్న‌ట్లు కాదు క‌దా అని సాయి కృష్ణ తండ్రి పోలీసుల‌కు చెప్పారు.