ఆడ‌పిల్ల పుట్టింద‌ని చెప్పి చ‌నిపోయిన మ‌గ‌పిల్లాడిని చేతిలో పెట్టిన వైద్యులు

karnataka hospital handed over dead baby to parents

Karnataka: క‌ర్ణాట‌కు చెందిన ఓ హాస్పిట‌ల్‌లో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ జంట‌కు ఆడ‌పిల్ల పుట్టింద‌ని చెప్పి ఆ త‌ర్వాత చ‌నిపోయిన మ‌గ‌పిల్లాడి మృత‌దేహాన్ని అప్ప‌గించార‌ట‌. కొప్ప‌ళ్ జిల్లాలోని ఓ పిల్లల హాస్పిట‌ల్‌లో గౌరీ అనే గ‌ర్భిణి డెలివ‌రీ నిమిత్తం నిన్న అడ్మిట్ అయ్యింది. ఈరోజు ఉద‌యం ఆమె పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింద‌ని గౌరీ భ‌ర్త‌కు వైద్యులు తెలిపారు.

కాకపోతే బిడ్డ బ‌రువు మ‌రీ త‌క్కువ‌గా ఉంద‌ని ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్‌లో పెట్టాల‌ని చెప్పి వేరే గ‌దిలోకి తీసుకెళ్లార‌ట‌. తీరా చూస్తే ఈరోజు సాయంత్రానికి బిడ్డ చ‌నిపోయింద‌ని చెప్పారు. అలా చ‌నిపోయిన మ‌గ బిడ్డ‌ను గౌరీకి అప్ప‌గించార‌ట‌. అది చూసి ఆమె షాకైంది. వెంట‌నే త‌న భ‌ర్త‌కు, బంధువుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే వారు వైద్యుల‌ను సంప్రదించారు. మీరు ఆడ‌పిల్ల పుట్టింద‌ని చెప్పారు క‌దా స‌ర్.. మ‌రి మ‌గ‌పిల్లాడి మృత‌దేహాన్ని చేతిలో పెట్టారేంటి అని అడిగాడు. కానీ వైద్యులు మాత్రం తాము అలా చెప్ప‌లేద‌ని మ‌గ పిల్లాడే పుట్టాడ‌ని చెప్పామ‌ని అన్నారు. దాంతో గౌరీ బంధువులు హాస్పిట‌ల్‌లో ఆందోళ‌న చేసారు. పోలీసుల‌ను సంప్ర‌దించ‌డంతో వారు సీసీ కెమెరా ద్వారా బిడ్డ‌ను ఎవ‌రైనా మాయం చేసుంటారా అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.