క‌న్న‌డ న‌టుడి కారు బీభ‌త్సం.. మ‌హిళ మృతి

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు నాగ‌భూష‌ణ (nagabhushana) కారు బీభ‌త్సం సృష్టించింది. శ‌ర‌వేగంగా వెళుతూ ఓ దంప‌తుల వాహ‌నాన్ని ఢీకొట్ట‌డంతో మ‌హిళ మృతిచెందింది. బెంగ‌ళూరులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కుమార‌స్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. నిన్న రాత్రి 9:45 గంట‌ల స‌మ‌యంలో ఉత్త‌ర‌హ‌ళ్లి నుంచి కోన‌న‌కుంటే వైపు నాగ‌భూష‌ణం కారులో శ‌ర‌వేగంగా వెళ్తుండ‌గా.. వ‌సంతపుర మెయిన్ రోడ్డు ఫుట్‌పాత్‌పై న‌డుచుకుంటూ వెళ్తున్న దంప‌తుల మీద‌కి కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ అక్కడిక‌క్క‌డే మృతిచెందింది. నాగ‌భూష‌ణం ఆ ఇద్ద‌రు బాధితుల్ని మ‌రో కారులో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అప్ప‌టికే మ‌హిళ చ‌నిపోవ‌డంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ మ‌హిళ భ‌ర్త‌కు క‌డుపులో, కాళ్లు చేతుల‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి. (nagabhushana)