Jayabheri: ముర‌ళీ మోహ‌న్ మోసం.. ల‌బోదిబోమంటున్న కొనుగోలుదారులు

jayabheri constructions fraud

Jayabheri: తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ మురళి మోహన్ జయభేరి నిర్మాణ సంస్థపై ప్లాట్లు కొనుగోలు చేసిన జనం తిర‌గ‌బ‌డ్డారు. అన్ని వసతులు ఉన్నాయని జయభేరి నిర్మాణ సంస్థ చెబితే ప్లాట్లు కొనుగోలు చేశామ‌ని కానీ జయభేరి నిర్మాణ సంస్థ త‌మ‌ని మోసం చేసిందని వాపోతున్నారు. పార్కింగ్‌లో లైట్లు వెలగడం లేదని సీసీ కెమెరాలు లేవని చివరకు ఫైర్ సేఫ్టీ కూడా లేదంటూ వివిధ ఫిర్యాదులు చేసారు. అయినా స్పందించట్లేదు అంటూ కార్లు అడ్డం పెట్టి మ‌రీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.