Hyderabad: జ‌వాన్ ప్రాణం తీసిన మాంజా

Hyderabad: హైద‌రాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. చైనీస్ మాంజా కార‌ణంగా ఓ జవాను ప్రాణం కోల్పోయారు. లంగ‌ర్ హౌస్‌లోని ఇంద్రా న‌గ‌ర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాగితాల కోటేశ్వ‌ర్ (30) అనే జ‌వాను బైక్‌పై వెళ్తుండ‌గా మాంజా గొంతుకు అడ్డుప‌డి కోసుకుపోయింది. దాంతో కోటేశ్వ‌ర్ బైక్‌పై నుంచి ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయారు. ఆయ‌న్ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండాపోయింది. కోటేశ్వ‌ర్ రెడ్డి స్వ‌స్థ‌లం విశాఖ‌ప‌ట్నంలోని పెద వాల్తేరు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం బాధాక‌రం.