EXCLUSIVE: 16000 బియ్య‌పు గింజ‌లతో అయోధ్య రామ‌మందిరం..!

EXCLUSIVE: జ‌గిత్యాల‌కు చెందిన ప్ర‌ముఖ గిన్నీస్ రికార్డు హోల్డ‌ర్, డాక్ట‌ర్ గుర్రం దయాక‌ర్ (gurram dayakar) ఏకంగా బియ్య‌పు గింజ‌ల‌తోనే అయోధ్య రామ‌మందిర (ayodhya ram mandir) బొమ్మ‌ను నిర్మించారు. దాదాపు 16000 బియ్య‌పు గింజ‌ల‌తో దీనిని నిర్మించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇది నిర్మించ‌డానికి దాదాపు 60 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. దీనిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కానుక‌గా ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.