Lord Ganesh: దేశంలోనే రిచెస్ట్ గ‌ణ‌నాథుడు..!

వినాయ‌క చవితి (lord ganesh) వ‌చ్చిదంటే ల‌క్ష‌లాది గ‌ణ‌నాథుడి విగ్ర‌హాల‌తో యావ‌త్ భార‌త‌దేశం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. మ‌న‌కు ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఫేమ‌స్ అయితే ముంబైలో లాల్‌బౌగ్చా మ‌హ‌రాజ్ ఫేమస్. అయితే భార‌త్‌లోనే అత్యంత సంపన్న గ‌ణ‌నాథుడి విగ్ర‌హం కూడా ముంబైలోనే ఉంది. 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో ఈ వినాయ‌కుడిని రూపొందించారు. ఈ ఏడాదితో 69వ వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హించారు. కొన్ని కోట్లు విలువ చేసే విగ్ర‌హం కావ‌డంతో సెక్యూరిటీ కోసం ఫేస్ రిక‌గ్నిష‌న్ కెమెరాల‌ను ఈ ఏడాదే ఇన్‌స్టాల్ చేయించారు. ఈ విగ్ర‌హం కోసం GSB సేవా మండ‌ల్ అనే ప్రత్యేక సంస్థ కూడా ఉంది. ఎందుకైనా మంచిద‌ని ఈ ఏడాదే విగ్ర‌హం కోసం దాదాపు రూ.360 కోట్ల మేర బీమా కూడా తీసుకున్నారు.  (lord ganesh)