Viral News: 2100 నాటికి దారుణ స్థితికి ప‌డిపోనున్న జ‌నాభా!

Viral News: ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్లు దాటేసింది. రాను రాను ఇంకెన్ని కోట్ల‌కు పెరుగుతుందో చెప్ప‌లేం కానీ 2100 వ‌చ్చే నాటికి జ‌నాభా రేటు దారుణంగా ప‌డిపోతుంద‌ట‌. ఈ విష‌యాన్ని లాన్సెట్ స్ట‌డీ బ‌య‌ట‌పెట్టింది. 1950ల నాటి నుంచి కొన్ని దేశాల్లో సంతానోత్ప‌త్తి రేటు తగ్గుతూ వ‌చ్చింది. ఇదే ట్రెండ్ 2100 వ‌ర‌కు కొన‌సాగుతుంది. 2100 వచ్చేస‌రికి దారుణంగా సంతానోత్ప‌త్తి రేటు ప‌డిపోతుంద‌ని లాన్సెట్ చేసిన నివేదిక‌లో తేలింది.  1950ల నాటికి సంతానోత్ప‌త్తి రేటు 4.84గా ఉంది. ఇది 2021 నాటికి 2.23కి ప‌డిపోయింది. 2100 నాటికి 1.59కి ప‌డిపోతుంద‌ట‌. ఇలా సంతానోత్ప‌త్తి రేటు ప‌డిపోవ‌డానికి చాలానే కార‌ణాలు ఉన్నాయి. పిల్ల‌ల్ని పెంచి చ‌దివించ‌గ‌ల స్తోమ‌త ఉండేవారే పిల్ల‌ల్ని క‌నాల‌నుకోవడం.. రోజురోజుకీ పెరిగిపోతున్న రేట్లు, జీవ‌న‌శైలిలో మార్పులు ఇలా చాలా కార‌ణాలు ఉన్నాయి.