పెళ్లి చేసుకోమంటూ ఆఫీస్‌లో ర‌చ్చ‌..!

Bihar: ఓ యువ‌తి త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడ్ని ఆఫీస్ నుంచి లాక్కెళ్లిన ఘ‌ట‌న (viral news) బిహార్‌లో (bihar) సంచ‌ల‌నం సృష్టించింది. భ‌గ‌ల్‌పూర్ ప్రాంతానికి చెందిన క‌రిష్మా .. అదే ప్రాంతానికి చెందిన రోహిత్ కుమార్ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోర‌ని తెలిసి క‌రిష్మా ఎప్ప‌టినుంచో గ‌డిలో పెళ్లి చేసుకుందాం అని ఫోర్స్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండు నెల‌ల క్రితం రోహిత్ కుమార్ క‌రిష్మా నుదుటిపై బొట్టు పెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. కానీ రోహిత్ త‌ల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వ‌కుండా గెంటేసారు. దాంతో క‌రిష్మా రోహిత్‌పై రేప్ కేసు పెట్టింది. భ‌గ‌ల్‌పూర్ పోలీసులు రోహిత్‌ను అరెస్ట్ చేసి రెండు నెల‌ల లాక‌ప్‌లో పెట్టారు. ఆ త‌ర్వాత రోహిత్ బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చాడ‌ని తెలిసి క‌రిష్మా నేరుగా అత‌న ప‌నిచేస్తున్న ఆఫీస్‌కి వెళ్లింది. (viral news).

పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ అంద‌రి ముందు కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీసింది. అత‌ను పెళ్లి చేసుకోను అని చెప్ప‌డంతో అంద‌రూ చూస్తుండ‌గానే ష‌ర్టు పట్టుకుని ద‌గ్గ‌ర్లోని గుడికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. పెళ్లి చేసుకోక‌పోతే విషం తాగి చ‌స్తాన‌ని బెదిరించింది. దాంతో ఆఫీస్‌లో గొడ‌వ చేస్తోందంటూ యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. వారిద్ద‌రినీ క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించి వ‌దిలేసారు.